Sunday, April 28, 2024

AP: టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి

శ్రీ సత్యసాయి బ్యూరో, ఫిబ్రవరి 13 (ప్రభన్యూస్): శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం, పుట్టపర్తి రూరల్ మండలం, నిడుమామిడి గ్రామంలో మంగళవారం టిడిపి కార్యకర్త మునిమడుగు బావయ్య కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు.చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 01-10-2023న బావయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. బావయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా భువనేశ్వరిని చూసి, భావోద్వేగానికి గురైన బావయ్య కుటుంబసభ్యులు. బావయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బావయ్య కుటుంబ సభ్యులకు భువనేశ్వరి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అంది చేశారు. భువనేశ్వరి వెంట మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల సునీత పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీనికి ముందు భువనేశ్వరి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement