Wednesday, May 8, 2024

నందికొట్కూరు పోలీసుల దాష్టికం … ఇద్ద‌రు యువ‌కుల‌పై థ‌ర్డ్ ఢిగ్రీ ప్ర‌యోగం

నందికొట్కూర్ ప్రభ న్యూస్ ఆగస్టు 13 – నందికొట్కూరు పోలీసులు ఇద్ద‌రు యువ‌కుల‌ను పోలీస్ స్టేష‌న్ కు పిలిచి చిత‌క‌బాదారు.. దీంతో వారికి తీవ్ర‌గాయాలు కావ‌డంతో చికిత్స కోసం హాస్స‌ట‌ల్ కు త‌ర‌లించారు.. ఈ నేప‌థ్యంలో నందికొట్కూరు, మండల పరిధిలోని మల్యాల గ్రామానికి చెందిన అశోక్, మహేష్ లను చితకబాదిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు డిమాండ్ చేశారు, ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అశోక్ మహేష్ లను పరామర్శించారు.

వివ‌రాల‌లోకి వెళితే, ఒక కేసులో నిందితులుగా ఉన్న అశోక్, మ‌హేష్ ల‌పై గతంలో వారిపై పిర్యాదు చేసిన పుల్ల‌య్య ఘ‌ర్ష‌ణ‌కు దిగాడు.. అంతేకాకుండా వారిపై పుల్ల‌య్య కేసు పెట్టాడు.. దీంతో పోలీసుల వారిని స్టేష‌న్ కు పిలిచి సిఐ స‌మ‌క్షంలో కొట్టిన‌ట్లు బాధితులు చెబుతున్నారు.. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపి బాద్యులైన పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సిపిఎం పార్టీ నేత‌లు డిమాండ్ చేశారు.. పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోకుంటే ఆందోళ‌న చేప‌డ‌తామ‌ని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement