Wednesday, May 15, 2024

కోడిపందాలు : సీఎం జ‌గ‌న్ కు ముద్ర‌గ‌డ లేఖ

కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కి లేఖ రాశారు. సంక్రాంతి పండుగ స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఐదు రోజుల పాటు కోడిపందాల కోసం పర్మిషన్ కు పర్మినెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని ముద్రగడ లేఖ ద్వారా సీఎం జ‌గ‌న్ ను కోరారు. కోడి పందాలు వంటివి జల్లికట్టు కంటే ప్రమాదకరమైన ఆటలు కావని… గ్రామాల్లో సంక్రాంతికి ఎడ్ల పందాలు, కోడిపందాలు, జాతర్లు ఆచారమ‌ని లేఖ‌లో ఆయ‌న‌ గుర్తు చేశారు. పండుగ‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌లంద‌రూ ఉత్స‌వాల్లో పాల్గొంటార‌ని, ప్ర‌జ‌లు పండుగ‌ల స‌మ‌యంలో జైళ్ల‌కు వెళ్లేలా ఉండ‌కూడ‌ద‌ని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సీఎం జ‌గ‌న్ ను కోరారు. అయితే ఏపీలో ప్ర‌తి సంక్రాంతి పండుగ స‌మ‌యంలో కోడి పందాలు, ఇత‌ర ఆట‌లు ఆగ‌డం స‌ర్వ సాధార‌ణమైన విష‌యం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement