Monday, May 6, 2024

ఒక ఎంపీటీసీ స్థానానికి.. ఎనిమిది నామినేషన్లు..

ఆలమూరు : మండలం జొన్నాడ ఎంపీటీసీకి సంబంధించి నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు మొత్తం ఎనిమిది నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి సత్య వేణు,ఎంపీడీవో జేఏ జాన్సీ వెల్లడించారు. అలాగే మండల కేంద్రమైన ఆలమూరు శ్రీ బొబ్బా జయశ్రీ బాలికల ఉన్నత పాఠశాల, ఎంపీపీ పాఠశాలలో బ్యాలెట్ పత్రాలు భద్రపరిచే గది (స్ట్రాంగ్ రూమ్), కౌంటింగ్ హాలును రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఎస్ ఇలాక్కియ, ఆలమూరు ఎంపీడీవో జేఏ జాన్సీ, తాసిల్దార్ జి లక్ష్మీపతితో కలిసి పరిశీలించారు. ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement