Thursday, May 2, 2024

ఏపీలో ఎన్నికల వేడి… ముగిసిన నామినేషన్ల పర్వం

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రంలో పలు కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ స్థానిక సంస్థలు ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఎన్నికలు నిలిచిన 14 జెడ్పీటీసీ స్థానాలతోపాటు 176 ఎంపీటీసీ, 69 సర్పంచ్, 533 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 14న పంచాయతీ ఎన్నికలు నిర్వహణ, ఓట్ల లెక్కింపు జరగనుంది. అలాగే ఈ నెల 15న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కౌంటింగ్ ను  నవంబర్ 17న జరగనుంది. ఇక, ఈ నెల 16న పరిషత్‌ ఎన్నికలు నిర్వహిస్తుండగా 18న కౌంటింగ్‌ జరగనుంది. నెల్లూరు కార్పొరేషన్‌తో 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 54 డివిజన్లు, 353 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే 7 కార్పొరేషన్‌లు, 13 మునిసిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల మరణంతో ఖాళీ అయిన స్థానాలకు.. ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగని డివిజన్లు, వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, పంచాయతీ ఎన్నికల్లో విజయంతో మంచి జోష్ లో ఉన్న అధికార వైసీపీ.. ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించాలని భావిస్తోంది.

ఇది కూడా చదవండి: టీడీపీ అభ్యర్థిపై దాడి.. ఏపీ ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement