Saturday, April 27, 2024

Breaking: కేంద్ర హోంశాఖకు ఎంపీ రఘురామ లేఖ.. ఏపీ సీఐడీ చీఫ్ పై ఫిర్యాదు!

కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై ఫిర్యాదు చేశారు. పీవీ సునీల్ కుమార్‌పై వరకట్నం వేధింపుల కింద తెలంగాణలో కేసు నమోదు అయిందని లేఖలో పేర్కొన్నారు. భార్య పిర్యాదు మేరకు సునీల్‌పై తెలంగాణలో ఛార్జ్ షీట్ నమోదు చేశారని తెలిపారు. ఎంపీ హోదాలో రాష్ట్రంలో శాంతిభద్రతల దృష్ట్యా … వరుస ఘటనలపై విచారణ జరిపి పీవీ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. పీవీ సునీల్ ను తక్షణమే సీఐడీ చీఫ్ పదవి నుంచి బదిలీ చేయాలని ఎంపీ రఘురామ లేఖలో పేర్కొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement