Saturday, April 27, 2024

అభివృద్ధి, సంక్షేమం.. సీఎం జగన్ కు రెండు కళ్లు

రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం రెండు కళ్ళులా సీఎం జగన్ పనిచేస్తున్నారని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. జి కొండూరు మండలం కుంటముక్కల గ్రామంలో రూ 78.50 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామ సచివాలయ భవనం,  రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ భవన నిర్మాణ పనులకు స్థానిక నాయకులు అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైలవరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమం చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు చేస్తున్న అసత్య పనికిమాలిన ఆరోపణలను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. పది కాలాలు పాటు పదిలంగా ఉండాల్సిన పక్కా భవనాల నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఇంజనీరింగ్ అధికారులు, గ్రామస్తులు పర్యవేక్షణ బాధ్యత తీసుకోవాలని విజ్ణప్తి చేశారు.

ఇది కూడా చదవండి: ఓట్ల కోసం ఈటెల అక్రమాలు.. ఒక్కో ఓటుకు రూ. 5 వేలు

Advertisement

తాజా వార్తలు

Advertisement