Sunday, April 28, 2024

రాజీనామాకు రెడీ: పరిటాల సునీతకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్

టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై స్పందించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల వరకు ఎందుకు ? ఇప్పుడే రాజీనామా చేస్తున్నానని సవాల్ విసిరారు. ఖాళీ లెటర్ హెడ్‌పై సంతకం చేసి ఇచ్చారు. తాను రాజీనామా చేస్తున్నట్టు రాసి స్పీకర్‌కు పంపాలని పరిటాల సునీతకు సూచించారు. తాను పరిటాల సునీతను వదినగానే చూస్తానని వంశీ అన్నారు. అయితే, తల్లికి, గర్భస్త శిశువుకు మధ్య గొడవలు పెట్టగలిగేంత తెలివైన వ్యక్తి చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను సునీత చదివి ఉండొచ్చని పేర్కొన్నారు. గన్నవరానికో, గుడివాడకో తానూ, కొడాలి నాని మొదలు కాదు.. చివర కాదన్నారు. దమ్ముంటే లోకేష్ గన్నవరం, గుడివాడలో పోటీ చేయాలన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన దీక్షలో మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గంట కళ్లు మూసుకుంటే తామేంటో చూపిస్తామన్నారు. మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. వల్లభనేని వంశీ, కొడాలి నానిలు ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. టీడీపీలో వాళ్లకు అవకాశం ఇచ్చారు కాబట్టే మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఎదిగారన్నారు. వాళ్ల కంటే ఎక్కువగా మాట్లాగలమని.. కానీ చంద్రబాబు అలా మాట్లాడొద్దని చెబుతున్నారు కాబట్టి ఓర్పుగా ఉన్నామని పరిటాల సునీత పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేతలతో చంద్రబాబు చర్చ

Advertisement

తాజా వార్తలు

Advertisement