Thursday, May 2, 2024

ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేతలతో చంద్రబాబు చర్చ

టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి యనమల ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సోమవారం ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ అయినట్టు తెలుస్తోంది. సోమవారం(అక్టోబర్ 25) రాష్ట్రపతిని చంద్రబాబు కలవనున్నారు. రాష్ట్రపతితో పాటు ఇంకా ఎవరెవరిని కలవాలి అనే దానిపై నేతలతో చర్చిస్తున్నారు. ఆర్టికల్ 356 ప్రవేశ పెట్టాలని ఇప్పటికే టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై గవర్నర్‌ను సైతం టీడీపీ నేతలు కలిశారు. ఆదివారం రాష్ట్రపతితో భేటీలోనూ ఆర్టికల్ 356 అంశం మరోసారి చర్చకు రానుంది. రాష్ట్రపతితో పాటు మరికొందరు కేంద్ర పెద్దలను కలిసే యోచనలో టీడీపీ ఉంది. ఢిల్లీ పర్యటనలో అనుసరించాల్సిన అజెండాపై పార్టీ ముఖ్యనేతలు సూచనలను చంద్రబాబు తెలుసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: smart tech: అప్‌డేట్స్ చేయ‌ట్లేదా.. అయితే మీ ఫోన్ రిస్క్‌లో ఉన్న‌ట్టే..

Advertisement

తాజా వార్తలు

Advertisement