Sunday, May 19, 2024

డయేరియా రోగులను పరామర్శించిన మంత్రి విడదల రజిని

తెనాలి రూరల్ : మండల పరిధిలోని కొలకలూరు గ్రామంలో డయేరియా ప్రబలి వ్యాధిగ్రస్తులైన వారిని శనివారం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని జిల్లా అధికారులతో గ్రామంలోకి వచ్చి పరామర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో వైద్య సేవలు మెరుగుపరిచి బాధితులకు అండగా ఉంటామని, ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నామని, వ్యాధి నివారణకు వైద్య బృందాలను ఏర్పాటుచేసి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. గ్రామస్తులు ఎవరూ భయపడవలసిన అవసరం లేదన్నారు. జిల్లా కలెక్టర్ యం.వేణుగోపాలరెడ్డి జాయింట్ కలెక్టర్ వివేక్ స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా ,తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement