Saturday, April 27, 2024

Eluru: ద్వారకా తిరుమలలో.. శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కారుమూరి

కామవరపుకోట, అక్టోబరు 24 (ప్రభ న్యూస్) : విజయదశమి పర్వదిన సందర్భంగా మంగళవారం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు
ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అంతరాలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచనం అందించి శేష వస్త్రాన్ని బహూకరించారు. మంత్రి నాగేశ్వరరావుకు స్వామివారి చిత్రపటాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి వి.త్రినాధ రావు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement