Thursday, May 16, 2024

Mallanna Temple – శ్రీశైలం దేవస్థాన అధికారుల తీరుపై ఎమ్మెల్యే శిల్పా ఆగ్ర‌హం..

శ్రీశైలం దేవస్థాన అధికారులు ఎన్ని సార్లు చెప్పిన తమ తీరు మార్చుకోవడం లేదని శ్రీశైల ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీశైల భ్రమరాంబికా ,మల్లికార్జున స్వామి వాళ్ళని దర్శించుకున్న అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ఎంతో ఆదాయం ఉన్న శ్రీశైలం ఆలయానికి కంచెలు వేసి భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాటి స్థానంలో మంచివి ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. ఆలయ అభివృద్ధి కి సహకరించే దాతలకు సరైన మర్యాదలు చేయడం లేదన్నారు. రూ. 5వేల టికెట్స్, రూ.1500 టికెట్స్ కొన్న భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని ఇప్పటికే పలువురు భక్తుల దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. భక్తులకు క్యూ లైన్లలో కనీసం మంచి నీరు అందించడం లేదన్నారు. పై అన్ని విషయాల త్వరలో జరిగేట్రస్ట్ బోర్డ్ మీటింగ్ లో చర్చించనున్నట్లు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement