Thursday, May 2, 2024

మండపేటలో గోవింద నామస్మరణ..

తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఇప్పనపాడు గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి రథయాత్ర మంగళవారం వైభవంగా నిర్వహించారు. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా స్వామి రథయాత్ర ఇప్పనపాడు చేరింది. బొమ్మల రామాలయం వద్ద ప్రచార రథం బృందంచే అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు.  మహిళలు సాంప్రదాయ వస్త్రాలు ధరించి కోలాట నృత్యాలతో సందడి చేశారు. పెద్దఎత్తున మహిళలు పాల్గొని స్వామివారికి హారతులు ఇచ్చారు. గ్రామాన్ని పసుపునీటితో గోవింద నామస్మరణతో శుద్ధి చేశారు. తిరుపతి నుండి తీసుకొచ్చిన గోవింద నామాలు కుంకుమ అక్షతలు స్వామి చిత్రపటాలు ఇంటింటికి అందజేశారు. గ్రామ సర్పంచ్ కుంచె వీరమణి ప్రసాద్ దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement