Tuesday, May 7, 2024

AP: మూడు రోజుల‌పాటు వికసిత్ భారత్ సంకల్పయాత్ర… కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన

కర్నూలుః జిల్లాలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాల్లో కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి ఎస్‌పిసింగ్ బగల్ పాల్గొంటార‌ని కలెక్టర్ సృజన తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జిల్లాలో నాలుగు చోట్ల వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు.

ఈనెల 9న‌ కర్నూల్ రూరల్ మండలం గార్గేయపురంలోను, 10న నందవరం మండల కేంద్రంలోనూ, మధ్యాహ్నం హోళగుంద మండలం గజ్జేహళ్లి లోను, 11న‌ తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటార‌ని తెలిపారు. మొదటి రోజు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని ప‌రిశీలిస్తార‌ని తెలిపారు. కూడా ఆయన సందర్శిస్తరని కలెక్టరు సృజన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement