Friday, May 3, 2024

AP: ఈ నెల 9, 10న కర్నూలు జిల్లాకు నారా భువనేశ్వరి

ఈనెల 9, 10వ తేదీల్లో మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఆమె పర్యటన ఉంటుందని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు వెల్లడించారు.

చంద్రబాబు అరెస్టు సందర్భంగా కర్నూలు జిల్లాలో మనోవేదనతో మృతిచెందిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారని తెలిపారు. భువనేశ్వరి పర్యటనను టీడీపీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement