Monday, April 29, 2024

అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ముగ్గురి గల్లంతు

కర్నూలు : అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ఆదోని చెందిన ముగ్గురు వ్యక్తుల ఆచూకీ గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరిలో ఆదోని చెందిన నాగనాథ్.. అతని భార్యతో పాటు ఆలూరు చెందిన నల్లన్న జాడ తెలియరాలేదు.. అమర్ నాథ్ యాత్ర కోసం కర్నూలు జిల్లా నుంచి దాదాపు 500 మందికి పైగా వెళ్లినట్టు సమాచారం. ఇందులో ఒక నంద్యాల నుంచి 110 మంది వెళ్ళగా, ఎమ్మిగనూరు నుంచి 19, కోడుమూరు నుంచి ఆరు, కర్నూలు వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement