Friday, March 29, 2024

మూడేళ్లలోనే మేనిఫెస్టోలోని 95శాతం హామీలు అమలు.. జగన్

మూడేళ్లలోనే మన మేనిఫెస్టోలోని 95శాతం హామీలను అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్లీనరీలో సీఎం జగన్ మాట్లాడుతూ… మేనిఫెస్టోలో చెప్పింది చేశామంటేనే వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటేయమని చెబుతున్నామన్నారు. చంద్రబాబు హయాంలో రూ.15వేల కోట్లు కూడా రుణాల మాఫీ చేయలేదన్నారు. బాబు హయాంలో సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా తీసేశారన్నారు. గత ప్రభుత్వం బకాయిలను మన నెత్తిన పడేసి వెళ్లిపోయిందన్నారు. మూడేళ్లలో ఒక్క రైతు భరోసా పథకం మీద రూ.23,875కోట్లు ఖర్చు చేశామన్నారు. చంద్రబాబు ప్రైవేటు స్కూళ్ల కోసమే పనిచేస్తారన్నారు. మనం ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ విద్య అందించేందుకు పనిచేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement