Friday, May 17, 2024

శ్రీశైలం ప్రాజెక్టుకు కొన‌సాగుతున్న వరద

ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా కృష్ణా నదిపై ఉన్న జలాశయాలకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయానికి 1,06,205 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నది. జలాశయం మూడు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం నుంచి 1,46,888 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మరో వైపు కుడి, ఎడమ గట్లలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.70 అడుగులున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement