Thursday, May 2, 2024

ఆయిల్​ ట్యాంకర్​ బోల్తా.. ఎగబడ్డ జనం.. క్యాన్లు, బిందెల్లో నింపుకొని..

పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్ల వద్ద ఈ ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆయిల్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా కొట్టింది. ఈ విషయం క్షణాల్లో సమీప గ్రామాలకు వ్యాపించింది. ఇంకేముంది… ప్రమాదం జరిగిన ప్రాంతానికి జనాలు పోటెత్తారు. ఆడ, మగ అనే తేడా లేకుండా బిందెలు, క్యాన్లు, బక్కెట్లు ఇలా ఏది దొరికితే దాన్ని పట్టుకుని ఆ ప్రాంతానికి ఎగబడ్డారు. దొరికినకాడికి ఆయిల్ నింపుకుని వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెన్నై నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ట్యాంకర్ ప్రమాదానికి గురైనట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement