Wednesday, May 15, 2024

పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

కర్నూలు జిల్లా కేంద్రంలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున కర్నూలులోని శ్రీలక్ష్మీనగర్‌లో ఉంటున్న విరసం నేత పినాకపాణి ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీ చేశారు. ఫిబ్రవరిలో కేరళలోని కొచ్చిలో పినాకాపానిపై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఈనేపథ్యంలో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనంతరం విచారణ నిమిత్తం కర్నూలు త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు రావాలని అధికారులు తెలిపారు. ఇంట్లో ఉన్న కొన్ని పుస్తకాలు, పెన్‌డ్రైవ్, హార్డ్ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే గతంలో కూడా పినాకపాణిని ఎన్‌ఐఏ విచారించిన విషయం తెలిసిందే. గతేడాది కూడా పినాకపాణి ఇంట్లో ఎన్‌ఏఐ అధికారులు సోదాలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement