Sunday, May 19, 2024

వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే ఆర్థర్

నందికొట్కూరు : కర్నూలులో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ పుష్ప గుచ్ఛం అందజేసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గ పరిస్థితులపై చర్చించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ తో పాటు వై.ఎస్.ఆర్.సి.పి నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బి.వై రామయ్య, కర్నూలు శాసన సభ్యులు హఫీజ్ ఖాన్, కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎస్.వి.మోహన్ రెడ్డి, మిడుతూరు మండల వైసిపి నాయకులు సల్కోటి గోవర్ధన్ రెడ్డి, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement