Tuesday, May 7, 2024

KNL: ఆలయ అభివృద్ధికి మంత్రి జ‌య‌రాం విరాళం

ఆలూరు : అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణం కోసం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం లక్ష రూపాయలు విరాళం అందించారు. ఆలూరు పట్టణంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో పట్టణం నందు నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి అందజేశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆలయ కమిటీ నిర్వాహకులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భక్తులు మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి, జడ్పీటీసీ ఏరూర్ శేఖర్, ఆలయ కమిటీ ఉపాధ్యక్షుల విష్ణు, గురుస్వామి, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement