Wednesday, May 1, 2024

న‌టులు విక్కీ కౌశ‌ల్‌, కత్రినా కైఫ్ ల‌ని చంపేస్తా-కేసు న‌మోదు చేసిన పోలీసుల‌

ఈ మ‌ధ్య‌కాలంలో సినీ సెల‌బ్రిటీలు ప‌లు బెదిరింపుల‌కు గుర‌వుతున్నారు. కాగా ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి సోష‌ల్ మీడియా ద్వారా బాలీవుడ్ న‌టులు విక్కీ కౌశ‌ల్‌, కత్రినా కైఫ్ జంట‌ని చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ నేప‌థ్యంలో ముంబైలోని శాంటాక్ర‌జ్ పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఆ కేసులో ద‌ర్యాప్తు కూడా ప్రారంభ‌మైంద‌న్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ న‌టులకు బెదిరింపులు వ‌స్తున్న‌ట్లు తేలింది. బెదిరింపునకు పాల్ప‌డిన వ్య‌క్తి క‌త్రినా కైఫ్‌ను వెంటాడుతున్న‌ట్లు తెలుస్తోంది. ఐటీ చ‌ట్టం ప్ర‌కారం కేసుని బుక్ చేశారు..ఈ వార్త ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement