Friday, April 26, 2024

బడిపంతులుగా మేయర్

. నగరంలో మున్సిపల్ పాఠశాల ఆకస్మిక తనిఖీ
• నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందికి హెచ్చరిక.

కర్నూలు ఓల్డ్ సిటిలోని పురపాలక ప్రాథమిక పాఠశాలలో మేయర్ బి.వై రామయ్య , కమిషనర్ డి.కే బాలాజీ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదిలో వెళ్ళిన మేయర్ బడిపంతులు గా మారి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు అక్షరాలు అడగగా సరైన సమాధానం లేకపోవడంతో ఉపాధ్యాయుడు ఓబులేసు, ప్రధాన ఉపాధ్యాయుడు ఆంజనేయులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదే చివరి అవకాశం అని, మరొసారి ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement