Sunday, April 28, 2024

AP: రోడ్డు ప్రమాదంలో… డ్రైవర్ సజీవ దహనం

కర్నూలు (ఆస్పరి), ఏప్రిల్ 22 (ప్రభ న్యూస్) : హర్యాణ రాష్ట్రంలోని బివాన్ మేవాత్ గ్రామానికి చెందిన నజీర్ (33) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో సజీవ దహనమైన ఘటన ఆస్పరి మండల పరిధిలోని చిన్నహోతూరు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఆస్పరి సీఐ హనుమంతప్ప తెలిపిన వివరాల మేరకు… వెలుగోడుకు చెందిన హుస్సేన్ అలం అనే వ్యక్తి తన ట్రక్కులో సున్నపు చిప్స్ లోడు తీసుకొని బళ్లారి నుండి హైదరాబాదుకు వెళుతుండగా.. చిన్నహోతూరు గ్రామ సమీపంలో తన లారీని ఒక సైడుకు ఆపుకొని బహిర్భూమికి వెళ్ళాడు.

అదే సమయంలో హర్యానా రాష్ట్రానికి చెందిన నజీర్ తెలంగాణ రాష్ట్రంలోని జడ్చర్లలో నివాసం ఉంటూ కేటిసి కంపెనీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే నజీర్ తన లారీలో బళ్లారి నుండి సిమెంటు లోడ్ తో వేగంగా వస్తూ ఆగి ఉన్న సున్నపు చిప్స్ లారీని కొట్టడంతో మంటలు చెలరేగి నజీర్ సజీవ దహనమయ్యాడు. ఈ విషయం తెలిసిన వెంటనే సీఐ హనుమంతప్ప తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సగం కాలిపోయి ఉన్న నజీర్(33) మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హ‌నుమంత‌ప్ప తెలిపారు. మృతునికి భార్య నలుగురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement