Friday, April 26, 2024

నంద్యాల జిల్లాలో పరువు హత్య.. క‌న్న కూతురినే కడతేర్చిన తండ్రి..

  • పాణ్యం మండలం ఆలమూరులో ఘ‌ట‌న‌..
  • మృతదేహంలో నల్లమల్ల అడవిలో పారేసిన వైనం
  • పోలీసుల దర్యాప్తుతో వెలుగులోకి..

నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరులో దారుణ ఘటన శనివారం వెలుగు చూసింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని సొంత కూతురినే కడతేర్చి నల్లమల అడవుల్లో పారేసిన తండ్రి. మనవరాలు ప్రసన్న (21) గత కొన్ని రోజులుగా ఆచూకీ కనబడకపోవడంతో అనుమానంతో కొడుకుపై ప్ర‌స‌న్న‌ తాత పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. తాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. కుమార్తెను తానే చంపి నల్లమల అడవుల్లో పారవేసినట్లు తండ్రి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి వెళ్లి తల, మొండెంను పోలీసులు తీసుకొచ్చారు. పాణ్యం ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చూరీలో భద్రపరిచారు. ప్రసన్నకు రెండేళ్ల క్రితమే బనగానపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ తో వివాహం జరగా.. వీరు హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే కొద్ది రోజుల కిందట ఆలమూరులో తండ్రి వద్దకు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా అంతకుముందే ఆమె గ్రామంలో ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే భర్తతో కాపురం చేయకుండా తరచూ ఆలమూరుకు వస్తూ, పోతున్నడంతో పరువు పోతుందని తానే హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో తండ్రి ఒప్పుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement