Monday, May 6, 2024

స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏ.మధుసూదన్ నామినేషన్

కర్నూలు : ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పర్వం జోరందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల తరపున బరిలో దిగుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు కలెక్టరేట్ లో నామినేషన్‌ దాఖలు చేస్తున్నారు. గురువారం కర్నూలు స్థానిక సంస్థల నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఏ.మధుసూదన్ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి, సంయుక్త కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డికి తన నామినేషన్ పత్రం అందజేశారు. ఆయన వెంట ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు బివై రామయ్యలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement