Friday, April 26, 2024

విమానం ఎక్కుతూ స్లిప్ అయిన.. అమెరికా అధ్య‌క్షుడు

ఎయిర్ ఫోర్స్ వ‌న్ విమానం ఎక్కుతూ ప‌డ‌బోయారు అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్. మెట్లు జార‌డంతో అలానే ముందుకు ఒరిగిపోయారు. ఉక్రెయిన్, పోలండ్ పర్యటన ముగించుకుని తిరుగుపయనమైన సమయంలో ఈ ఘటన జరిగింది.
ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో వెళ్లేందుకు సగం మెట్లను మెల్లగా ఎక్కినై బైడెన్.. మిగతావి ఎక్కుతుండగా స్లిప్ అయ్యారు. అలానే ముందుకు ఒరిగిపోయారు. చేతులతో మెట్లను పట్టుకుని నిలదొక్కుకుని పైకి లేచారు. తర్వాత విమానం అంచుకు చేరుకుని.. చెయ్యెత్తి అభివాదం చేసి లోపలికి వెళ్లిపోయారు. విమానం ఎక్కుతుండగా మెట్లు జారి బైడెన్ పడిపోవడం ఇదే తొలిసారి కాదు. 2021లో జార్జియా వెళ్లేందుకు మెట్లు ఎక్కుతూ బైడెన్ రెండుసార్లు తడబడినట్లు న్యూయార్క్ పోస్ట్’ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement