Wednesday, May 8, 2024

Kurnool – విద్యార్థిని అదృశ్యం – పాఠశాలపై గ్రామస్తుల దాడి

కర్నూలు జిల్లా, కోసిగి మండలం వందగల్లు గ్రామంలో శనివారం పాఠశాల పై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడిచేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపు చేసేందుకు యత్నించారు. పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థిని అదృశ్యం కావడమే ఇందుకు కారణం.

ఈ విషయంలో పాఠశాల పీఈటీ చెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు దాడికి దిగారు.ఉపాధ్యాయుడిని పోలీసులు జీపులో తీసుకెళ్తుండగా వెంబడించి దాడి చేయడం గమనార్హం. ఉపాధ్యాయుడు చెన్నయ్య ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement