Sunday, May 19, 2024

బుల్లెట్ బండి కోసం ప్రాణం తీసుకున్న యువకుడు

బుల్లెట్ బండి కోసం ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్న ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. బుల్లెట్ బండిపై మోజుతో తన తల్లి సహకారంతో తీసుకున్న బండిని ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లడంతో ఆ యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫైనాన్స్‌లో తీసుకున్న బుల్లెట్‌ బండికి కిస్తీలు కట్టకపోవడంతో కంపెనీ వాళ్లు స్వాధీనం చేసుకోగా.. మనస్తాపానికి గురైన యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. యువకుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తపేట కోమల విలాస్‌ ప్రాంతానికి చెందిన బెహర లక్ష్మీ, సోమేష్‌ దంపతులకు ఇద్దరు సంతానం. కొంత కాలంగా దంపతులు విడివిడిగా ఉంటున్నారు. తల్లి వద్ద ఉంటున్న కుమారుడు కార్తీక్‌ డేకరేషన్‌ పనులు చేస్తుంటాడు. కొన్ని నెలల క్రితం కార్తీక్‌ బుల్లెట్ బండి కావాలని తల్లిని కోరగా.. బంగారు నాన్‌తాడు అమ్మి రూ.50 వేలు డౌన్‌ పేమెంట్‌గా కట్టి బుల్లెట్‌ కొనిచ్చింది. ఈఎంఐలు కట్టకపోవడంతో శుక్రవారం కంపెనీ సిబ్బంది వచ్చి బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో రాత్రి అంతా ఇదే విషయాన్ని తల్లికి, స్నేహితులకు చెప్పుకొంటూ మానసిక క్షోభ అనుభవించాడు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement