Tuesday, May 7, 2024

ప్రాణం తీసిన ఈత సరదా.. తాడేప‌ల్లి పుష్క‌ర‌ఘాట్‌లో ఘ‌ట‌న‌..

తాడేపల్లి, (ప్రభ న్యూస్) : ఈత సరదా ఒక‌రి ప్రాణాలు తీసింది. తాడేపల్లి సీతానగరం పుష్కర‌ ఘాట్ లో ఆదివారం ఉదయం ఈతకు వచ్చిన యువకుడు మృతి చెందాడు. ఈ యువకుడు విజయవాడ పట్టణం గుణదలకు చెందిన పవన్ కళ్యాణ్ (19) గా పోలీసులు గుర్తించారు.

నలుగురు యువకులు కలిసి సరదాగా ఈతకు వచ్చినట్లు తెలుస్తోంది. యువకుడి మృతిపై కేసు నమోదు చేసి తాడేపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement