Tuesday, April 30, 2024

స్కాన్ చేయండి.. నాంచార‌మ్మ‌ హుండీ మొక్కులు తీర్చుకోండి

  • విశ్వనాధపల్లి నాంచారమ్మ ఆలయం వద్ద యూపీఐ పేమెంట్ ద్వారా ఉండి మొక్కులు చెల్లించుకునే అవకాశం

కోడూరు: టీ స్టాల్ మొద‌లు భారీ మాల్స్ వరకు అన్ని చోట్ల డిజిటల్ పేమెంట్స్ కు అవకాశం కల్పించడంతో ప్రజలు ఫోన్ ద్వారానే నగదు చెల్లించి తమకు కావలసినవి కొనుగోలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదే త‌ర‌హాలో దేవాదాయ అధికారులు కూడా తమ ఆలోచనలకు పదును పెట్టి ప్రజల సౌలభ్యం కోసం యూపీఐ పేమెంట్ ద్వారా హుండీ మొక్కులు చెల్లించుకునే వెసులుబాటు కల్పించారు. కృష్ణా జిల్లా కోడూరు మండల పరిధిలోని విశ్వనాధపల్లి శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి దేవాలయం వద్ద దేవాదాయ అధికారులు ప్రధాన హుండీ పై యూపీఐ స్కానర్ ను పెట్టి డిజిటల్ పేమెంట్ ద్వారా తమ మొక్కులు చెల్లించుకోవచ్చు అంటూ ప్రచారం చేపట్టారు. దేవాలయ ప్రాంగణంలో పలు చోట్ల  యుపిఎ స్కానర్లు ఏర్పాటుచేసి భక్తులు నేరుగా తమ హుండీ మొక్కులు అమ్మవారి బ్యాంక్ ఖాతాకు జమ చేసే విధంగా వెసులుబాటు కల్పించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement