Friday, May 17, 2024

ఏపీలో దిశ, దశ లేని ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ, దశ లేని ప్రభుత్వం పాలన చేస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే.. ఏకైక ప్రత్యామ్నాయం బిజెపి, జనసేన మాత్రమేనని చెప్పారు. రెండు నెలల క్రితమే అమిత్ షా మాకు ఈ విషయం పై దిశానిర్దేశం చేశారని గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చే నిధులను మళ్లించి జగన్ తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. 14, 15వ ఆర్దిక సంఘం నుంచి గ్రామాల అభివృద్ధికి మోడీ నిధులు కేటాయించారని తెలిపారు. మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సోమువీర్రాజు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement