Wednesday, May 15, 2024

సీఎం కేసీఆర్ చిత్ర ప‌టానికి పాలాభిషేకం చేసిన – మంత్రి , మెప్మా,ఐకేపీ ఉద్యోగులు

సీఎం కేసీఆర్ చిత్ర ప‌టానికి పాలాభిషేకం చేశారు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి.. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా సెర్ప్‌, మెప్మా,ఐకేపీ ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అందుకుగాను నిర్మల్‌లో సీఎం చిత్రపటానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రెడ్డి, మెప్మా ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు లక్షల 32 వేల ఉద్యోగాలను భర్తీ చేశారని, మరో 90 వేల ఉద్యోగాల సైతం భర్తీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న మెప్మా, ఐకేపీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా వేతనాలు ఇవ్వడం సంతోషకరమైన విషయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా మిగాతా ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తారన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement