Thursday, May 9, 2024

కనకదుర్గమ్మను దర్శించుకున్న రోజా

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కాసేపట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఆమె ఈరోజు ఉదయం విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయమర్యాదలతో రోజాకు అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులచేత వేద ఆశీర్వచనం పొందారు. ఆశీర్వచనం అనంతరం లడ్డు ప్రసాదాన్ని అమ్మవారి చిత్రపటాన్ని మంత్రి రోజాకు ఈవో భ్రమరాంబ అందజేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement