Saturday, April 27, 2024

12న అనంత‌పురం జిల్లాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌న

ఈ నెల 12వ‌తేదీన‌ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి.. పార్టీ తరఫున లక్ష రూపాయల చెక్కులను బాధితుల కుటుంబాలకు అందజేయనున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. 12న సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత.. రోడ్డు మార్గంలో కొత్త చెరువుకు చేరుకుంటారని మధుసూదన్ రెడ్డి తెలిపారు. అక్కడి నుంచి ధర్మవరం పట్టణంలోని శివనగర్, గొట్లూరు, బత్తలపల్లి మండలంలో పర్యటిస్తారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement