Tuesday, April 30, 2024

ఎస్ ఈ సీగా బాధ్య‌తలు స్వీక‌రించిన నీలం సాహ్ని..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని విజ‌య‌వాడ‌లోని ఎన్నిక‌ల కార్యాల‌యంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్‌ఈసీగా నియమితులైన నీలం సాహ్నికి కమిషన్ కార్యదర్శి కన్నబాబు, ఇతర అధికారులు పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలియజేశారు. కాగా ఇప్పటి వరకు ఏపీ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగిన నిమ్మగడ్డ రమేష్ ‌ కుమార్‌ పదవీ కాలం మార్చి 31తో ముగియ‌డంతో ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు.. దీంతో ఆయ‌న స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు. రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్‌ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్ట్‌ ఐఏఎస్‌ అధికారులతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ కార్యాలయానికి పంపించగా నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమించేందుకు ఆమె పేరును గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ ఖరారు చేశారు. దీంతో ఆమె ఎస్ ఈ సిగా నేడు బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement