Friday, April 26, 2024

ఆరోరోజుకు అమరావతి రైతుల మహా పాదయాత్ర

అమరావతి రైతుల మహా పాదయాత్ర ఆరో రోజు ప్రారంభమైంది. శనివారం ఉదయం ఐలవరం నుంచి మహాపాదయాత్ర మొదలైంది. రేపల్లె నియోజకవర్గంలోకి పాదయాత్ర అడుగుపెట్టింది. రైతులకు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ సెప్టెంబర్ 12 నుంచి అమరావతి రైతులు మహా పాదయాత్ర-2ను ప్రారంభించారు. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి వరకూ పాదయాత్రగా వెళ్లనున్నారు. రాజధానిలోని 29 గ్రామాల నుంచి రైతులు, మహిళలు, వివిధ వర్గాల వారు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. అలాగే రైతుల మహా పాదయాత్రకు రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement