Sunday, April 28, 2024

జాతీయ పతాకావిష్కణ గావించిన మంత్రి కొప్పుల

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు జగిత్యాలలో అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గుగులోతు రవి, ఎస్పీ సింధు శర్మ, జిల్లా జడ్జి వేడుకలకు హాజరయ్యారు. అంతకు ముందు మంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రగతిని వివరించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపారు. ఈ వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. వారిని మంత్రితో పాటు అతిథులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement