చెన్నై వ్యాపార వేత్త అరుళ్ శరవణన్ లెజెండ్ టైటిల్ తో పాన్ ఇండియా మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 60 కోట్ల బడ్జెట్ తో రిచ్ గా లెజెండ్ మూవీ తెరకెక్కింది. అయితే లెజెండ్ మూవీతో వచ్చిన నష్టం మొత్తం ఆయనే భరించారు. ఏదో ముచ్చట తీర్చుకోవడానికి ఒక సినిమా చేశారని అందరూ అనుకున్నారు. వ్యవహారం చూస్తే సినిమాను సీరియస్ కెరీర్ గా తీసుకున్నారనిపిస్తోంది. అరుళ్ మరో మూవీకి సిద్ధం అవుతున్నారు. అరుళ్ కొత్త మూవీ ప్రకటన త్వరలో రాబోతుందట. కోలీవుడ్ ఫిల్మ్ ట్రాకర్ రమేష్ బాల ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. అరుళ్ కొత్త మూవీ యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో ఈ చిత్రానికి ఎన్ని కోట్లు ఖర్చు చేయనున్నాడో అని కోలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. 50ఏళ్ల వయసులో ఆయనకి సినిమాల్లో నటించాలనిపించడం ఏంటో అని అందరూ అనుకుంటున్నారు. మరి ఈ చిత్రాన్ని అయినా ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో చూడాలి.
Advertisement
తాజా వార్తలు
Advertisement