Saturday, April 20, 2024

జ‌గ‌న్ సంక‌ల్పం ఎంతో గొప్ప‌ది… మంత్రి అప్ప‌ల‌రాజు

సీఎం జ‌గ‌న్ సంక‌ల్పం ఎంతో గొప్ప‌ద‌ని ఏపీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయ‌న మాట్లాడుతూ… జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నార‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తే మంచిదో జ‌గ‌న్ కు బాగా తెలుసు అన్నారు. శివ‌రామ‌కృష్ణ క‌మిటీ సూచ‌న మేర‌కే వికేంద్రీక‌ర‌ణ చేప‌ట్టామ‌న్నారు. రాజ‌ధాని నిర్ణ‌యం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌దేన‌ని కేంద్రం అఫిడ‌విట్ లో చెప్పింద‌న్నారు. మూడు రాజ‌ధానులపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నామ‌న్నారు. అవ‌స‌ర‌మైతే అసెంబ్లీలో మ‌ళ్లీ బిల్లు పెట్టి మూడు రాజ‌ధానుల‌తో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement