Tuesday, May 14, 2024

AP | కట్లేరుపై ప్రవహిస్తున్న వరద నీరు.. వాగు దాటొద్ద‌ని హెచ్చ‌రిక‌

గంపలగూడెం, (ప్రభ న్యూస్): భారీ వ‌ర్షాల‌కు ఎన్టీఆర్ జిల్లాలో వాగులు వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. తిరువూరు నియోజకవర్గ పరిధిలోని గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్లేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. అల్పపీడనం కారణంగా ఐదు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు, కాలువలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కట్లేరు వాగు ఉధృతి కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సమీప 20 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద తగ్గే వరకు వాగు దాటవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement