Tuesday, May 14, 2024

ఇళ్ల నిర్మాణానికి సాయం.. సిమెంట్ అంద‌జేస్తున్న దాత‌!

హనుమాన్ జంక్షన్, (ప్రభ న్యూస్): కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం, బిళ్ళనపల్లి గ్రామానికి చెందిన దేవినేని కృష్ణాకిషోర్ ఆదర్శంగా నిలుస్తున్నారు. స్వార్థంతో నిండిపోయిన సమాజంలో నిస్వార్ధoగా తమ అమూల్యమైన సేవలు అందిస్తున్న మహోన్నతవ్యక్తి బాపులపాడు మండలం బిళ్లనపల్లిగ్రామానికి చెందిన దేవినేని కృష్ణ కిషోర్ పదిమందికి ఆదర్శంగా నిలుస్తూ తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నూజివీడు మండలం సీతారాంపురంలో నిర్మిస్తున్న సి.ఎస్.ఐ, చర్చి కమిటీ సభ్యులు బండారు బాబురావు, గోసరి యాకోబు, పెదగర్ల మరియమ్మ చర్చ్ నిర్మాణానికి సహాయం చేయాలని కోరటంతో 50 బస్తాల సిమెంట్ ను మంగళవారo వారికి అందజేశారు.

- Advertisement -

అలాగే బిళ్ళనపల్లి గ్రామానికి చెందిన ఆరేపల్లి నాగలక్ష్మి అనే మహిళ ఇల్లు నిర్మించుకోవడం తో ఆమెకు 50 బస్తాల సిమెంట్ ను మంగళవారం అందజేశారు. కాగా దేవినేని కిషోర్ ఇలా బిళ్ళనపల్లి గ్రామoలో ఇళ్ళు నిర్మాణం చేసుకుంటున్న జగనన్న కాలనీ గాని మరేదైనా గాని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి సిమెంట్ బస్తాలు ఇచ్చి సహకారం అందించారు. బిళ్ళనపల్లి గ్రామంలో ఎవరు ఇళ్ళు కట్టుకున్నా సిమెంట్ బస్తాలు అందిస్తానని కిషోర్ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement