Thursday, May 2, 2024

అవమానాలు భరించలేక‌నే పార్టీ మారాను.. జెడ్పీ చైర్ పర్సన్ సరిత

జోగులాంబ గద్వాల ప్రతినిధి, (ప్రభ న్యూస్): అధికార బీఆర్ఎస్ పార్టీలో నాలుగేళ్లలో తాను అనేక అవమానాలు ఎదుర్కొని తీవ్ర మనస్థాపానికి గుర‌య్యాన‌ని, అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు జెడ్పి చైర్ పర్సన్ సరిత అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విలేకరులతో ఇవ్వాల (మంగ‌ళ‌వారం) మాట్లాడారు. తాను బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులతో అనేక అవమానాలకు గుర‌య్యాన‌ని, దీంతో తాను మనస్థాపానికి గురైన‌ట్టు చెప్పారు. అనేక సమావేశాలలో స్థానిక నాయకులు తనను దూరంగా ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్థానికురాలుని కాననే అపోహాలు కొంతమందిలో ఉన్నాయని, గతంలో ఇక్కడ పాలించిన నాయకులు స్థానికేతరులు కాదా అని ప్రశ్నించారు. పేద బడుగు బలహీన వర్గాల నుండి తాను ప్రశ్నిస్తున్నానని బలహీనవర్గాలకు రాజ్యాధికారం రావాలని తపనతో తాను రాజకీయాలలోకి వచ్చినన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement