Monday, May 6, 2024

వాటర్ హీటర్ తో విద్యుత్ షాక్.. తల్లి కూతురు మృతి

బంటుమిల్లి, (ప్రభ న్యూస్) : కృష్ణాజిల్లాలో ఘోరం జరిగింది. బంటుమిల్లి మండల పరిధిలోని జానకిరాంపురం బీసీ కాలనీలో వాటర్ హీటర్ తో విద్యుత్ షాక్ గురై తల్లి కూతురు చనిపోయారు. ఈ ఘటన ఇవ్వాల (మంగళవారం) మ‌ద్యానం పూట‌ చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వల్లభు అనూష (23), ఆమె కుమార్తె చిన్నారి వల్లభ దన్విక (యాడాది వయసు) ఇంట్లో వాటర్ హీటర్ అకస్మాత్తుగా పట్టుకోవడం తో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే నేలకి ఒరిగారు. వెంటనే ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. అనుకోకుండా సంబంధించిన ఈ ప్రమాదంతో జానకిరామపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement