Saturday, April 27, 2024

అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

ఏలూరు జిల్లాలోని కైకలూరులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. కైకలూరు నియోజకవర్గ పరిధిలో ఏడిద సత్యనారాయణ, కొందాడ ప్రసాద్ 21 కేసులో నిందితులుగా ఉన్నారు. ఇటీవల ముదినేపల్లి మండలంలో 9 ద్విచక్ర వాహనాలు చోరీ చేయడంతో పాటు చేవూరులో ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. కైకలూరు మండవల్లి, కలిదిండి, యలమంచిలి మొగల్తూరు మండలాల్లో ఇద్దరు దొంగలపై 11 కేసులు నమోదయ్యాయి. నిందితుల వద్ద నుంచి 21 ద్విచక్ర వాహనాలు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు, కేజీన్నర వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మీడియా సమావేశంలో తెలిపారు. వీటి విలువ రూ.13 లక్షల ఉంటుందని చెప్పారు. నిందితుల్లో ఏడిద సత్యనారాయణ 2011 నుంచి ఉదయ గోదావరి, ఏలూరు, కృష్ణ జిల్లాలలో 60కి పైగా దొంగతనాలు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement