Thursday, May 9, 2024

Hyd: ఎంజే మార్కెట్ వద్ద ఫ్లెక్సీల వివాదం

హైదరాబాద్ లోని ఎంజే మార్కెట్ వద్ద ఫ్లెక్సీల వివాదం చోటుచేసుకుంది. అస్సాం సీఎం వస్తుండడంతో ఉత్సవ సమితి స్టేజ్ ఏర్పాటు చేసింది. ఎంజే మార్కెట్ చౌరస్తాలో తలసాని ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు టీఎస్ నేతలు వచ్చారు. దీంతో ఫ్లెక్సీ పెట్టొద్దని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు అన్నారు. కాసేపట్లో అస్సాం సీఎం వస్తారని గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. ఇక్కడే ఫ్లెక్సీ పెడతామని టీఆర్ఎస్ నేతలు అన్నారు. దీంతో టీఆర్ఎస్, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement