Sunday, April 28, 2024

నిమజ్జనానికి సర్వం సిద్ధం… భారీ క్రేన్ల ఏర్పాటు

గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు వేడుకైన నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైంది. నిమజ్జనోత్సవం జరిగే మినీ ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిమజ్జనం కోసం రెండు భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. మినీ ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లను పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి, సిఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి తో పాటు పలువురు పరిశీలించారు. శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు మున్సిపల్ ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యం కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement