Monday, May 6, 2024

Vijayawada: ఆందోళన చేస్తున్న‌ అంగన్వాడీ కార్యకర్తల అరెస్ట్​

త‌మ‌కు క‌నీస వేత‌నం రూ.25వేలు ఇవ్వాల‌ని అంగ‌న్వాడీ కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా నిన్నటి అరెస్టులను ఖండిస్తూ.. అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. కనీస వేతనం రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమను అడ్డుకోవటం సరికాదని మండిపడ్డారు. కనీస వేతనం అడిగితే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నేరవేర్చాలని డిమాండ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement