Wednesday, May 15, 2024

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.  ఉదయం కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు   రవిశంకర్ గురూజీ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు  కిషన్ రెడ్డి, సమీర్ శర్మ,  రవిశంకర్ గురూజీ లకు వేదాశీర్వచనం చేశారు. అనంత‌రం టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అదనపు ఈవో  ఏవి.ధర్మారెడ్డిలు కలిసి శ్రీ‌వారి తీర్థప్రసాదాలు వారికి  అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో రమేష్ బాబు, ఇతర అధికారులు  పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement